Wednesday, May 8, 2024

AP : రెండు జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌…

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇవాళ రెండు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు. ఈ రెండు జిల్లా టూర్‌ కోసం మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి.. భీమవరం చేరుకుంటారు.

- Advertisement -

పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ కు చేరుకుని.. వైసీపీ నాయకులు గుణ్ణం నరసింహానాగేంద్రరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకోనున్న ఏపీ సీఎం.. ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే పార్టీ నేత, డీసీసీబీ చైర్మన్‌ కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. దీంతో సీఎం జగన్‌ రెండు జిల్లాల పర్యటన ముగియనుంది. అనంతరం విశాఖపట్నం నుంచి సాయంత్రం తాడేపల్లికి చేరుకోనున్నారు జగన్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement