Monday, May 6, 2024

AP : నేడు అనకాపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

సీఎం జ‌గ‌న్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. సీఎం ప్రత్యేక విమానంలో ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు.

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కశింకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు. వేదికపై మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంత‌రం స‌భ‌లో సీఎం ప్రసంగిస్తారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌ చేయూత చివరి విడత నిధుల పంపిణీని బటన్‌ నొక్కి ప్రారంభిస్తారు. మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం బయలుదేరి కశింకోటలో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. గంటసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తిరుగుపయనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement