Monday, April 29, 2024

ఈ నెల 5న తిరుపతికి జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రూ. 240 కోట్ల వ్యయంతో అలిపిరి వద్ద నిర్మించనున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.

భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన తిరుమల పైకి వెళ్లే నడకమార్గం శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు.  అనంతరం తిరుపతిలో నిర్వహించే జగనన్న విద్యాకానుక బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.   

Advertisement

తాజా వార్తలు

Advertisement