Thursday, May 16, 2024

నేడు సీఎం జగన్ బిజీబిజీ.. కడప, విశాఖ జిల్లాల్లో పర్యటన

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఆదివారం బిజీబిజీగా గడపనున్నారు. సీఎం జగన్ ఇవాళ ఉదయం సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు కడపకు చేరుకుంటారు. అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన అనంతరం కడప రింగ్ రోడ్డు జయరాజ్ గార్డెన్స్‌లో జరిగే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తాడేపల్లి నివాసానికి తిరుగుతు ప్రయాణమవుతారు.

సాయంత్రం విశాఖ పర్యటనకు వెళ్తారు. సాయంత్రం 4:45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. సాయంత్ర 5:30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చే భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్న తర్వాత రాత్రి విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement