Monday, May 6, 2024

దేశంలో తగ్గిన కరోనా.. 20 వేలకు దిగువన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,22,473 కు చేరింది. ఇందులో 4,20,86,383 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో కరోనాతో 325 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,11,903కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,847 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,24,187కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement