Monday, May 20, 2024

రేపు గ‌వ‌ర్న‌ర్ తో సీఎం జ‌గ‌న్ భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. ఈసంద‌ర్భంగా మర్యాదపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు జగన్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు గురించి గవర్నర్ కు జగన్ వివరించనున్నారు. కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని గవర్నర్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే వచ్చే నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. మంత్రివర్గ విస్తరణపై కూడా జగన్ గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement