Saturday, May 18, 2024

వ‌చ్చే నెల 8న ముగియ‌నున్న ‘నుమాయిష్’ ఎగ్జిబిష‌న్

నుమాయిష్ ఎగ్జిబిష‌న్ హైద‌రాబాద్ నాంప‌ల్లిలో సంద‌డి చేస్తోంది. కాగా వ‌చ్చే నెల 8న ఈ ఎగ్జిబిష‌న్ ముగియ‌నుంది. జనవరి 1న ఈ ఎగ్జిబిష‌న్‌ను తెలంగాణ‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే, క‌రోనా నిబంధ‌న‌ల వ‌ల్ల మరుసటి రోజే అత్యవసరంగా మూసివేశారు. అయితే, ఫిబ్రవరి 25న ఎగ్జిబిష‌న్ మ‌ళ్లీ ప్రారంభమైంది. దాన్ని ఏప్రిల్‌ 10 వరకు కొనసాగించాల‌ని భావించారు. అయితే, శ్రీరామ నవమితో పాటు ఇతర వేడుకలు ఉండ‌డంతో ఎగ్జిబిష‌న్‌కు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయలేమని పోలీసులు తెలిపారు. దీంతో తాజాగా స‌మావేశ‌మైన‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ వచ్చే నెల 8వ తేదీ వరకే నుమాయిష్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇకపోతే, ఇప్పటి వరకు ఎగ్జిబిష‌న్‌ను ఎనిమిది లక్షల మంది సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement