Wednesday, May 15, 2024

వైసీపీ రెండేళ్ల పాలనపై పుస్తకం.. ప్రజలకు ప్రగతి నివేదిక..

రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉందని సీఎం జగన్ అన్నారు.  రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశామని, రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని చెప్పారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని సీఎం విడుదల చేశారు. రెండేళ్ల పాలనపై ప్రజలకు నివేదించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ  86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు. అందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement