Wednesday, May 29, 2024

కడపలో సీఎం జగన్ కి ఆత్మీయ వీడ్కోలు

ఒక్క జిల్లా పర్యటనను విజయవంతంగా ముగించుకుని విజయవాడకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదివారం కడప విమానాశ్రయంలో జిల్లా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆదివారం ఉదయం కడప రిమ్స్ సమీపంలో పుష్పగిరి కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనంతరం జయరాజ్ గార్డెన్స్ సమీపంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా కుమార్తె వివాహ మహోత్సవానికి హాయాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.45 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుండి ప్రత్యేక విమానంలో 12.50 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటుతో పాటు ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement