Friday, April 26, 2024

MLAల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించిన 27మంది శాసనసభ్యుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో 27మంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పేర్లతో సహా ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు పనితీరుపై ప్రోగ్రెస్ ప్రస్తావిస్తూ, 27మందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి పనితీరు మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం జగన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement