Tuesday, May 7, 2024

న‌టుడు ర‌వికిష‌న్ కి రూ.325కోట్లు ఎగ‌నామం పెట్టిన వ్యాపార‌వేత్త‌ – కేసు పెట్టిన పీఆర్ వో

త‌న స్నేహితుడు .. ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త అయిన జైన్ జితేంద్ర ర‌మేశ్ కు 3.25 కోట్లు ఇచ్చారట న‌టుడు..బిజెపి ఎంపీ ర‌వికిష‌న్. జైన్ జితేంద్ర ర‌మేశ్ ఆ న‌గ‌దును తిరిగివ్వ‌డంలో భాగంగా ర‌వికిష‌న్‌కు రూ.34 ల‌క్ష‌ల చొప్పున 12 చెక్కుల‌ను అంద‌జేశాడు. అయితే ర‌వికిష‌న్ వాటిలో ఒక చెక్కును గ‌తేడాది డిసెంబ‌ర్ 7న గోర‌ఖ్‌పూర్ ఎస్‌బీఐ బ్రాంచ్ )లో డిపాజిట్ చేశారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. ఆ త‌ర్వాత ర‌వికిష‌న్ స్నేహితుడు జైన్ జితేంద్ర ర‌మేశ్‌కు త‌రచూ ఫోన్ చేసినా స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. జైన్ జితేంద్ర నుంచి స్పంద‌న స‌రిగా లేక‌పోవ‌డంతో గోర‌ఖ్‌పూర్ పరిధిలోని పోలీస్ స్టేష‌న్‌లో అత‌నిపై ఫిర్యాదు చేసిన‌ట్టు ర‌వికిష‌న్ పీఆర్‌వో ప‌వ‌న్ ధూబే తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్టు కంటోన్మెంట్ పీఎస్ ఇన్‌చార్జ్ శ‌శి భూష‌ణ్ రాయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement