Tuesday, May 14, 2024

ఏపీలో ఇంటింటా జెండా కార్య‌క్ర‌మం : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల : 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వ‌హించ‌నుంద‌ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇందులోభాగంగానే ఏపీలో 10 లక్షల ఇళ్లలో ఇంటింటా జేండా కార్యక్రమాని నిర్వహించేందుకు బీజేపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేప‌ట్టార‌న్నారు. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మహనీయుల చరిత్రను భావితరాలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహించాల‌న్నారు. లోన్ యాప్ లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకురావాల‌డి డిమాండ్ చేశారు. రాయలసీమలో సాగు, తాగునీరు ప్రాజెక్ట్ కోసం ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement