Wednesday, May 8, 2024

చంద్రబాబును హత్య చేయాల్సిన పని మాకు లేదు : మంత్రి ఆర్కే రోజా

తిరుపతి సిటీ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హత్య చేయాల్సిన పని మాకు లేదని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం తిరుపతి జిల్లా క్రీడా సంబరాలు ప్రారంభం కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం మాట్లాడుతూ.. చంద్రబాబు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని అడగడం ఇదేం కర్మ రా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు అన్నారు. చంద్రబాబును చూసి ఇదేం కర్మ రా బాబు అనుకుంటున్నారని వివరించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని తెలియజేశారు. రాయలసీమ వాసిగా చంద్రబాబును చూసి తలదించుకుంటున్నారన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు వస్తుంటే అడ్డుకునేలా చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక వర్గాల వారీగా మోసం చేసిన చంద్రబాబు వారిని ఓట్లు అడుగుతుంటే ఇదేం కర్మ రా బాబు అని అనుకుంటున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాలు మాని మనవాడితో ఆడుకుంటే మేలు అన్నారు. చంద్రబాబుకు ఏ సింపతి బాబుకు ఏ వర్గం సింపతి సూపడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement