Sunday, May 5, 2024

చిత్తూరు జిల్లాలో విషాదం.. బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి..

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం వి.కోట మండలం జవ్వునిపల్లెలో తల్లి, ఇద్దరు పిల్ల‌లు బావిలో ప‌డి మృతి చెందారు. జవ్వుని పల్లెకు చెందిన వెంకటరమణ భార్య అరుణ (28), కుమారులు హరీష్(7), జతిన్ (5) మృతి చెంద‌గా.. అత్తింటి వారిపైనే అనుమానం ఉంద‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. తోటి కోడలే వారిని బావిలోకి తోసిందంటుంద‌ని మృతురాలి బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మృతికి గ‌ల వివ‌రాలు సేక‌రించారు. హ‌త్య లేక ఆత్మ‌హ‌త్య అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement