Friday, April 26, 2024

ములాయంసింగ్ పార్థివ దేహానికి నివాళుల‌ర్పించిన – చంద్ర‌బాబునాయుడు

టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు..యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళుల‌ర్పించారు.
ములాయం కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు గల్లా జయదేవ్, కనకమేడల తదితరులు ఉన్నారు.
ములాయం సింగ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయిలో జరగనున్నాయి. నేడు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి సైఫాయికి వెళ్లారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరుతారు. మరోవైపు, మలాయం అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement