Sunday, April 28, 2024

మునుగోడులో ఓటర్ల నమోదుపై బీజేపీ హైకోర్టులో రిట్ పిటిషన్

తెలంగాణ హైకోర్టులో మునుగోడులో ఓటర్ల నమోదుపై బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టు నే పరిగణనలోకి తీసుకునేలా ఈసీని ఆదేశించాలంటూ బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తక్కువ టైంలో సుమారు 25 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14న ఈసీ ఓటర్ల లిస్టు ప్రకటించనుంది. అయితే హైకోర్టు ఆదేశాలు వచ్చేంతవరకు ఈసీ ఓటర్ లిస్ట్ ప్రకటించకుండా చూడాలని బీజేపీ కోరుతోంది. కాగా బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఎల్లుండి విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement