Thursday, April 25, 2024

చండూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ

నల్గొండ మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం చండూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు చాడా వెంకట్ రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములుతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. స‌భ‌కు సిపిఎం, సిపిఐ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement