Wednesday, May 8, 2024

Tirupati : అదుపు త‌ప్పి విద్యుత్ పోల్ ని ఢీకొట్టిన పామాయిల్ ట్యాంక‌ర్‌..

తిరుపతి సిటీ : అదుపు తప్పిన పామాయిల్ ట్యాంకర్ 220 కేవీ విద్యుత్ పోల్ ను ఢీకొట్టిన ఘ‌ట‌న రేణిగుంట మండలం మల్లవరం సమీపంలో పెట్రోల్ బంకు వద్ద చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం పామాయిల్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పి విద్యుత్ పోల్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో భారీ విద్యుత్ లైన్ పడిపోయింది. అయితే ట్యాంకర్ డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంత‌రం డ్రైవర్ పరారయ్యాడు. సమాచారాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడంతో విద్యుత్ లైన్ ను నిలుపుదల చేశారు. సంఘటన స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement