Saturday, April 27, 2024

TDP : వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే : అచ్చెన్నాయుడు

2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో రాజమండ్రిలో మహానాడును నిర్వహిస్తామన్నారు. మహానాడులో వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలు చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. విజయ దశమికి సమగ్రమైన, రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. 26వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారని.. 26 సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుందని వివరించారు. ఆ సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టే 15 తీర్మానాలు చర్చించి ఆమోదిస్తామన్నారు. 27న 15 వేలమంది ప్రతినిధుల సభలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. 28న మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని.. మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం ఆరంభమవుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement