Saturday, April 27, 2024

ఆగస్టులో తిరుమల శ్రీవారి సర్వదర్శనం?

భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరోనా పాజిటివిటీ రేటు 1 శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శనం అందించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండగా.. మరో 20 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం రూ.300 దర్శనం టికెట్ తీసుకున్న వారికే శ్రీవారిని దర్శించుకునే అవకాశముంది.

కాగా కరోనా నేపథ్యంలో గతేడాది 2020 మార్చి 20 నుంచి స్వామి వారి సేవలు టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా కొన్నాళ్లు భక్తులకు దర్శనం కూడా నిలిపివేసింది. 2020 జూన్‌ 7 నుంచి రోజుకు 5 వేల మందితో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనాలు ప్రారంభించింది. ఆ తర్వాత సామాన్యులకు సైతం స్వామి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేసింది. వీటి కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. అయితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement