Tuesday, May 7, 2024

ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్ద‌తుగా బిజెపి కేంద్ర నాయ‌కుల ప్ర‌చారం…

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ను బిజెపి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.. ఈ స్థానం గెలిచేందుకు స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డుతున్న‌ది.. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలోకి రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు కేంద్ర నాయ‌కుల‌ను కూడా దించుతున్న‌ది… ఇప్ప‌టికే బిజెపికి మ‌ద్ద‌త్తు ఇస్తున్న జ‌న‌సేన ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చే నెల 3వ తేదిన తిరుప‌తి లో ర‌త్న‌ప్ర‌భ‌కు మ‌ద్దతుగా భారీ ర్యాలీ, బ‌హింరంగ స‌భ‌లో నిర్వ‌హించ‌నున్నారు.. ఇక ఏప్రిల్ 8న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో పర్యటించనున్నారు. అలాగే తెలంగాణ‌ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఏప్రిల్ 4న రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘ‌నంద‌న్ రావు 5న‌, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ 14న ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement