Wednesday, May 1, 2024

35 సార్లు కరోనా టెస్ట్ చేసుకున్న పవన్ హీరోయిన్

కరోనా మహమ్మారి వ్యాప్తికి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా దీంతో షూటింగ్ కి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్చేయించుకోవాలనేది ఒక రూల్ గా పెట్టారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ మరో సారి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఇక ఇదే విషయమై నిధి అగర్వాల్ మాట్లాడుతూ… లాక్డౌన్ తర్వాత షూటింగ్ కి వెళ్తున్న ప్రతిసారి నేను టెస్ట్ చేయించుకుంటున్నాను.

మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా… ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పటివరకు నేను 35 సార్లు టెస్ట్ చేయించుకున్నాను. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, వంటి ప్రదేశాలు తిరగాల్సి వచ్చింది. వాస్తవానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పట్లేదని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. అలాగే గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటు మరి కొన్ని చిత్రాల్లో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement