Saturday, April 27, 2024

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

కుప్పం (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : వివాహేతర సంబంధం ముగ్గురు పిల్లల తల్లి ప్రాణాలు తీసిన ఉదంతం శనివారం చిత్తూరు జిల్లా కుప్పం లో వెలుగు చూసింది. పోలీసుల కధనం ప్రకారం ఆ ఉదంతం పూర్వపరాలు ఇలా ఉన్నాయి. కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి సమీపంలో నివాసముంటున్న వెంకటేష్, భార్య చిన్నమ్మ దంపతులకు ముగ్గులు సంతానం. కుమార్తెకు వివాహం కూడా చేసిన చిన్నమ్మ ఆనంద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పలుమార్లు భార్యాభర్తలు గొడవపడేవారు .. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి చిన్నమ్మతో పాటు ఆనంద్ ను పెద్దమనుషులమందలించారు.
ఫలితం కనిపించక పోవడంతో శుక్రవారం సాయంత్రం భార్యాభర్తలు మళ్లీ గొడవ పడ్డారు. ఆ సందర్బంగా చిన్నమ్మను వెంకటేష్ చితకబాదాడు. ఇదే విషయమై చిన్నమ్మ గ్రామ పెద్దలకు తెలిపితే పొద్దున్న మాట్లాడుకుంటామంటూ సర్ది చెప్పి పంపించారు

.అయితే ఏం జరిగిందో తెలియదు గానీ శనివారం ఉదయం కల్లా చిన్నమ్మ ఇంట్లో మృతి చెంది కనిపించింది. తన భార్య మృతి చెందిందంటూ భర్త వెంకటేష్ స్థానికులకు తెలుపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి చిన్నమ్మ భర్త వెంకటేష్ ప్రియుడు ఆనంద్ తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement