Saturday, May 4, 2024

ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి… ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి – శ్రీరామనవమి శుభసందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ పట్టాభి రామాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారి పెద్దిరాజు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరోనా మహమ్మారి మన నుండి త్వరగా అంతమైపోవాలని అలాగే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు, బుల్లెట్ జై శ్యామ్ రాయల్, సాధన మున్నా రాయల్, నరసింహులు, కంచి గురవయ్య, పర్వతాల, హరికృష్ణ రాయల్, మధు రెడ్డి, బుజ్జి రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement