Thursday, April 25, 2024

డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు రద్దు

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మరికొన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ, బీకాం తదితర కోర్సుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెలలో మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement