Wednesday, May 8, 2024

తిరుపతిలో ఇంటర్ విద్యార్థి మిస్సింగ్


తిరుపతిలో ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్ అయ్యిన ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణపురానికి చెందిన ఇంటర్ విద్యార్థిని మోనీషా కనిపించడం లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గుడికి వెళ్లిన బాలిక.. ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పోలీసులను ఆశ్రయించారు. బాలిక విజయవాడలో చదువుతుండగా.. వేసవి సెలవులు కావడంతో ఇంటికొచ్చింది. మంగళరం రేణుక అనే వివాహిత కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement