Friday, May 17, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదానికి ప‌రిమితి

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమ‌ల‌లోని వెంక‌న్న‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తుతున్నారు. దీంతో భ‌క్తుల‌కు ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిమితులు విధించింది. నిన్న‌టి వ‌ర‌కు భ‌క్తుల‌కు ఎలాంటి ప‌రిమితి లేకుండా వారి కోరిన్ని కొనుక్కునే వీలుండ‌గా.. ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. ఓ ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు లడ్డూలు మాత్రమే విక్రయించిన విషయం వాస్తవమేనని లడ్డూ ప్రసాద విక్రయం కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం భక్తుల సంఖ్య రోజుకు 90 వేలు దాటుతుండగా, లడ్డూలు మాత్రం 3 లక్షలు మాత్రమే తయారుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో నాలుగు లడ్డూలు విక్రయిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement