Thursday, May 2, 2024

పెరుగుతోన్న క‌రోనా కేసులు-కొత్త‌గా 3,712కేసులు

ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త 24గంట‌ల్లో 3,712కొత్త కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచే రెండు వేలకు పైగా కేసులు వచ్చాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 739 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఐదుగురు చనిపోయారు. ఇక దేశంలో ప్రస్తుతం 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది. మరోపక్క, 4,26,20,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,641 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1.94 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 12,44,298 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement