Friday, May 3, 2024

కుమార్తెలను హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్..

మదనపల్లి – మూడ భక్తితో ఇద్ద‌రు కుమార్తెల‌ను హ‌త్య చేసిన నిందితులైన దంప‌తులు పురుషోత్తం నాయుడు, ప‌ద్మ‌జ‌ల‌కు నేడు బెయిల్ ల‌భించింది.. ఈ ఏడాది జ‌న‌వ‌రి 24వ తేదిన ఈ ఇద్ద‌రు త‌మ కుమార్తెలైన అలేఖ్య‌, దివ్య సాయిల‌ను హ‌త్య చేశారు.. మూడ భ‌క్తి, మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు అప్ప‌ట్లో పోలీసులు నిర్దారించారు.. ఈ కేసులో వారిని అరెస్ట్ చేసి మాన‌సిక చికిత్స కోసం విశాఖ మాన‌సిక వైద్య‌శాల‌కు త‌ర‌లించారు… మూడు నెల‌ల చికిత్స అనంత‌రం ఈ ఇద్ద‌రు కోలుకున్నారు.. అనంత‌రం వారిని మ‌ద‌న‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు.. ఈ కేసులో వారు బెయిల్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, విచారించిన కోర్టు వారికి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. దీంతో వారు నేడు జైలు నుంచి విడుద‌ల కానున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement