Friday, May 3, 2024

తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ పొంగులేటి

తిరుమల: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగిన సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులతో పాటు స్వామివార్లను దర్శించున్నవారిలో సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి దంపతులు, వియ్యంకులు రామసహాయం రఘురామిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement