Wednesday, May 8, 2024

కుప్పం వద్ద తెగిన విద్యుత్ తీగలు, నిలిచిపోయిన పలు రైళ్ల రాకపోకలు

చిత్తూరు జిల్లా కుప్పం-మల్లనూర్ రైల్వే మార్గంలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కుప్పం మీదుగా బెంగళూర్ వెళ్లే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, బృందావన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరో రెండు స్పెషల్ రైళ్లను జోలర్ పేటలో ఆపేశారు. బెంగళూర్ నుండి కుప్పం మీదుగా జోలర్‌పేట, జోలర్‌పేట నుండి బెంగళూర్ వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement