Monday, April 29, 2024

కత్తులతో నరికి.. అడవిలో పడేసి..! తరువాత ఏం జరిగిందంటే..?

దొరవారిసత్రం : తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం మినమలమూడి అటవీప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. చెన్నై ఆరంబాకంకు చెందిన ఓ వివాహిత మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి కారులో తీసుకు వచ్చి కత్తులతో ఆమెపై విచక్షణారహితంగా నరికి అడవిలో పడేసి వెళ్లారు. నిన్న రాత్రి ఈ దారణం చోటు చేసుకోగా ఆ మహిళ చనిపోయి ఉంటు-ందని కిడ్నాపర్లు ఆమెను మినముల మూడి అడవిలో వదిలేసి వెళ్లిపోయారు. అటవీ ప్రాంతానికి కూతవేటు- దూరంలో దీపావళి సందర్భంగా టపాసులు పేలి శబ్దాలు రావడంతో ఆ మహిళ స్పృహలోకి వచ్చి గిరిజన కాలనీ వద్దకు అతి కష్టం మీద చేరుకుంది. శరీరమంతా కత్తి పోట్లుకు గురై రక్తపు మరకలతో ఉన్న మహిళ సమాచారాన్ని గిరిజనులు ఆ గ్రామ సర్పంచ్‌కు తెలియ జేశారు. ఆమెను అంబులెన్స్‌లో సూళ్లూరుపేటకి అక్కడ నుండి చెన్నై కి తరలించారు. ఆమె పేరు నదియాగా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement