Saturday, April 20, 2024

ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుంది..సోనియాగాంధీ

నేడు ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు మల్లికార్జున ఖర్గే. న్యూఢిల్లీలోని ఎఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గేకు సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించారు . ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లున్నాయన్నారు. ఖర్గే నాయకత్వంలో ఈ సవాళ్లను అధిగమిస్తూ పార్టీ ముందుకు వెళ్లనుందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేను అభినందించారు సోనియాగాంధీ,.ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా ఆమె చెప్పారు.సామాన్య కార్యకర్త నుండి అంచెలంచెలుగా మల్లికార్జున ఖర్గే ఎదిగారని ఆమె గుర్తు చేశారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement