Thursday, May 2, 2024

తిరుప‌తి పర్యటనకు సీఎం జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈనెల 16వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. ఆయన తిరుపతిలో నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. గత కొంత కాలంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు మొదటి దశ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈనెల 16వ తేదీన ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకూ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement