Friday, April 19, 2024

Breaking : క‌ర్నాట‌క ప‌రిస్థితులు పొరుగు రాష్ట్రాల‌కు రాకూడ‌దు – న‌టుడు క‌మ‌ల్ హాస‌న్

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదంపై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ట్వీట్ చేశారు. క‌ర్నాట‌క ప‌రిణామాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయ‌న్నారు. విద్యార్థుల మ‌ధ్య మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌న్నారు. క‌ర్నాట‌క ప‌రిస్థితులు పొరుగు రాష్ట్రాల‌కు రాకూడ‌ద‌న్నారు. త‌మిళ‌నాడు స‌హా అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు క‌మ‌ల్ హాస‌న్. ట్విట్ట‌ర్ లో క‌మ‌ల్ హాస‌న్ పోస్ట్ చేశారు. ఈ సమస్య “అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజన” సృష్టిస్తోందని మక్కల్ నీది మైయం (ఎంఎన్‌ఎం) చీఫ్ కమల్ హాసన్ అన్నారు..ఇలాంటి సమయాల్లో తమిళనాడు మరింత జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement