Saturday, May 4, 2024

తిరుప‌తి బ‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా చింతా మోహ‌న్…..

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత చింతా మోహ‌న్ పోటీ చేయ‌నున్నారు.. ఈ మేర‌కు ఆయ‌న పేరును ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్ర‌క‌టించారు.. కాగా ఇదే స్థానం నుంచి ఆయన గతంలో తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజయం సాధించారు..కేంద్ర మంత్రి గా కూడా బాధ్యతలు నిర్వహించారు..గత ఎన్నికలలో కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసిన చింతా మోహన్ వైసిపి అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.. తాజాగా ఇప్పుడు జ‌రిగే ఉప ఎన్నిక‌ల‌లో బ‌రిలో దిగి అదృష్టాన్ని ప‌రిక్షించుకోనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement