Monday, April 29, 2024

చంద్రబాబు రెండోరోజు పర్యటన.. కుప్పంలో ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు రెండో రోజు పర్యటన ఉంది. ఆయన కాసేపట్లో కుప్పంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అలాగే టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్ దగ్గర బైఠాయించారు. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement