Thursday, April 25, 2024

తిరుప‌తిలో రీ పోలింగ్ నిర్వ‌హించాల్సిందే …బిజెపి అభ్య‌ర్ధి ర‌త్న‌ప్ర‌భ డిమాండ్

తిరుప‌తి – తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌లో భాగంగా ప‌లు పోలింగ్ కేంద్రాల‌లో అధికార వైసిపి దొంగ ఓట్లు పోల్ చేయించింద‌ని బిజెపి అభ్య‌ర్ధి కె ర‌త్న‌ప్ర‌భ ఆరోపించారు.. తాను ప‌లు కేంద్రాల‌లో త‌నిఖీ చేసిన సంద‌ర్భంలో పలువురు దొంగ ఓట్లు వేయ‌డం గ‌మనించాన‌ని, వారంద‌ర్ని అరెస్ట్ చేయించ‌డం జ‌రిగింద‌న్నారు… అలాగే ఇత‌ర ప్రాంతాల నుంచి దొంగ ఓట‌ర్ల‌ను ర‌వాణ చేస్తున్న ప‌లు ప్రైవేటు వాహ‌నాల‌ను సైతం తాను ద‌గ్గ‌రుండి సీజ్ చేయించాన‌ని తెలిపారు… అధికార పార్టీ ఓట‌మి భ‌యంతో ఈ దొంగ ఓట్ల‌కు తెర‌లేపింద‌ని పేర్కొన్నారు…ప్ర‌జ‌ల‌ను ఓటు వేయ‌కుండా చేసి వైసిపి ప్ర‌జాస్వామ్యాన్ని ఖూని చేసింద‌ని అన్నారు..పోలీసులు సైతం దొంగ ఓట్ల‌ను అడ్డుకోలేక‌పోయార‌న్నారు.. ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.. ఈ మేర‌కు అభ్య‌ర్ధ‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంప‌నున్న‌ట్లు తెలిపారు….

Advertisement

తాజా వార్తలు

Advertisement