Saturday, April 20, 2024

ఏఐటీయూసీ మహాసభ..

పెద్దపల్లి ‌: ఈనెల 20న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఏఐటీయూఐసీ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునిల్‌ పిలుపునిచ్చారు. పట్టణంలో ఉప ప్రధాన కార్యదర్శి పూసాల రమేశ్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు కడారి తిరుపతిలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. 20న సాయిగార్డెన్‌లో జరిగే మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌లు హాజరవుతారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. మహా సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడారి నరేష్‌, సతీష్‌, కడారి సంజీవ్‌, దాడి ఓదెలు, బూత్కురు పోచమల్లు, పన్నాల తిరుపతి, నరసయ్యలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement