Sunday, April 28, 2024

AP: కుప్పంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.. పాల్గొన్న నారా భువనేశ్వరి

కుప్పం, ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్): టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా కుప్పం నియోజకవర్గం పెద్ద ఎత్తున వాడవాడలా సంబరాలు చేసుకొన్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నడం పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్నిచ్చింది. కుప్పం మున్సిపాలిటీ రెండవ వార్డులో వెలసిన‌ కదిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయంలో నారా చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజ‌ర‌య్యారు. ఆలయ కమిటీ పెద్దలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందించి ఆలయం వద్ద కుప్పం మున్సిపాలిటీ, సామగుట్టపల్లి గ్రామస్తులు సూపర్ సిక్స్ పథకాలను ప్రతిబింబిస్తూ వినూత్నంగా ఏర్పాటు చేసిన 74కేజిల భారీ కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సామగుట్టపల్లి గ్రామస్తులు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

చంద్ర‌బాబు అనిత‌ర సాధ్యుడు, అద్వితీయ దార్శ‌నికుడు: రఘురామకృష్ణరాజు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతలు ఎంత మంది ఉన్నా… జాతి గర్వపడే నాయకులు కొందరే ఉంటారని రఘురాజు అన్నారు. ఆ కొందరిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉంటారని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని… ఆయన ఒక అనితరసాధ్యుడని, అద్వితీయ దార్శనికుడని, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి అని కొనియాడారు. అలాంటి రాజర్షికి ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. చంద్రబాబుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement