Sunday, April 28, 2024

ADB: బీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శిని పార్టీలోకి ఆహ్వానించిన బీజేఎల్పీ నేత ఏలేటి

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ శోభారాణి సత్యనారాయణ గౌడ్ ను ఆయన నివాస గృహంలో శనివారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్లమెంటు అభ్యర్థి గార్డెన్ నగేష్ లు మర్యాదపూర్వకంగా కలిసి బీజేపీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

ఆయనతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు అదమల్ల రమ పద్మాకర్, నవీన్ కుమార్, నరేందర్ లను శాలువాల‌తో సత్కరించి సన్మానించారు.. ఇందులో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్, పార్లమెంటరీ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, వడ్డే రాజేందర్ రెడ్డిల‌తో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement