Sunday, May 5, 2024

బైక్​ను ఢీ కొట్టిన లారీ… ఒకరు మృతి..

తిరుపతి సిటీ : నాయుడుపేట పూతలపట్టు 150 బైపాస్ రోడ్ లోని తనపల్లి క్రాస్ వద్ద బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో తనపల్లిలోని నల్ల మాను కాలువ చెందిన బాలాజీ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్సీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేర‌కు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement