Saturday, May 11, 2024

Breaking: స్కార్పియో బీభత్సం.. ముగ్గురి మృతి

స్కార్పియో వాహ‌నం బీభ‌త్సం సృష్టించ‌డంతో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రో 12మంది తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. పెళ్లి పనులతో ఆ ఇళ్లంతా సందడిగా ఉండి.. కాసేపట్లో వచ్చే వరుడికి స్వాగతం పలికేందుకు వధువు కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే అంతులేని విషాదం జరిగింది. పెళ్లికుమారుడికి స్వాగతం పలికేందుకు రోడ్డుపక్కనే వేచి ఉన్న వధువు కుటుంబ సభ్యులపైకి ఓ స్కార్పియో వాహనం వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను స్వప్న రెడ్డి(22), సంజు రెడ్డి(23), భారతి రెడ్డి(12)గా పోలీసులు గుర్తించారు. గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాండియాపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వీరంతా కేశవ్ నగర్​కు చెందిన వారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement