Friday, May 3, 2024

ఎపి బిజెపి ఎమ్మెల్సీ అభ్య‌ర్ధులు వీరే..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడప-అనంతపురం-కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి నగరూరు రాఘవేంద్ర, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌ రెడ్డి బీజేపీ అధిష్టానం ఖరారు చేయగా శ్రీకాకుళం- విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌నే ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల్ల్రోని ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుండడంతో ఎన్నికల సంఘం ఇటీ-వల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన అభ్యర్థులకు ఫోన్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement