Thursday, May 2, 2024

Cm Jagan: విజయవాడలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ‌ విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement