Sunday, May 19, 2024

AP: విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష విరమణ

విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష శుక్రవారం ముగిసింది. రిషికేష్ వేదికగా జూలై 3వ తేదీన దీక్షకు శ్రీకారం చుట్టారు. అక్కడ తెలవారుజామున గంగాతీరంలో వపన సంస్కారం అనంతరం స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి పూజలు చేసిన తర్వాత విశాఖ శ్రీ శారదాపీఠం రిషికేష్ ఆశ్రమంలో దీక్షను విరమించారు.

ఈ సందర్భంగా భగవద్గీతను కొద్దిసేపు పారాయణం చేసారు. అనంతరం వీరభద్ర మందిరాన్ని సందర్శించి విశేష అభిషేకం నిర్వహించారు. చాతుర్మాస్య దీక్ష ముగియడంతో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి శనివారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు తమ చాతుర్మాస్య దీక్షను ఏటా రిషికేష్ వేదికగా చేపట్టడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. దీక్షా సమయంలో లోక కళ్యాణార్ధం విశేష పూజలు, వైదిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement