Saturday, April 27, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 20, 21 , 22 తేదీలలో చంద్రబాబు పర్యటన..

అమరావతి, ఆంధ్రప్రభ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల, 20వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 20న కుక్కునూరు, వేలేరుపాడు, మండలాలలో పర్యటిస్తారు.

21న కూనవరం, చింతూరు, ఏటపాక, విఆర్‌పురం లో పర్యటించనున్నారు. 22న పి. గన్నవరం, రాజోలు లో చంద్రబాబు పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ పర్యటన నిమిత్తం చంద్రబాబు 19న భద్రాచలం చేరుకుంటారని సమాచారం. అక్కడనుంచే చంద్రబాబు ముంపు మండలాలలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement