Monday, May 6, 2024

AP : నెల్లూరులో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌…వీపీఆర్ దంపతుల చేరిక‌…

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్ గా బరిలోకి దిగితే కుదరదని, జనసేన తో పొత్తు పెట్టుకుంది. తాజాగా ఉమ్మడి భారీ సభ సైతం నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాగా ఇవాళ చంద్ర‌బాబు నెల్లూరులో ప‌ర్య‌టించ‌నున్నారు.

వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగే భారీ సమావేశానికి హాజరు కానున్నారు.మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లని పరిశీలించారు. చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులు, వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయం చంద్రబాబు నెల్లూరుకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం సమావేశంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement