Saturday, May 18, 2024

రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు : అమ‌ర్నాథ్

రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రూ.34 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఎంవోయూలు చేసుకున్న దానిలో రెండు శాతం పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు అమరరాజా కంపెనీ రూ.2,700 కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. ఏపీకి ఈరోజు రూ.8,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement