Sunday, May 5, 2024

కేంద్రం గెజిట్‌ అధ్యయనం చేశాకే స్పందిస్తా: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని చంద్రబాబు తెలిపారు. బచావత్ ట్రైబ్యునల్‌, గెజిట్‌కు వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బాధ్యత లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement